సముద్రంలో మునిగిపోయిన తెలుగు విద్యార్థుల గల్లంతు

సెల్వి

శనివారం, 2 మార్చి 2024 (17:16 IST)
Mahabalipuram
తమిళనాడులోని మహాబలిపురం సముద్రంలో ముగ్గురు తెలుగు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు. ఈ ముగ్గురూ చిత్తూరు జిల్లా పలమనేరు ప్రభుత్వ కాలేజీ విద్యార్థులు కావడం గమనార్హం. కాలేజీ తరపున 18 మంది విద్యార్థుల బృందం తమిళనాడు టూర్‌కి వెళ్లింది. 
 
మహాబలిపురంలో సరదాగా ఈత కోసం విద్యార్థులు సముద్రంలోకి దిగారు. ఈ సందర్భంగా విజయ్, ప్రభు, మౌనిష్ అనే విద్యార్థులు గల్లంతయ్యారు. 
 
గల్లంతైన విద్యార్థుల కోసం గజ ఈతగాళ్లు ప్రయత్నిస్తున్నారు. గల్లంతు సమాచారంతో తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు