దేశంలో భానుడి సెగ.. గుడ్ న్యూస్ చెప్పిన ఐఎండీ.. వర్షాలు

సెల్వి

మంగళవారం, 12 మార్చి 2024 (11:25 IST)
దేశంలో భానుడు భగభగమంటున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. ఉత్తర భారతంలో ఇప్పుడిప్పుడే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే ప్రజలకు భారత వాతావరణ శాఖ గుడ్​ న్యూస్​ చెప్పింది. 
 
ఈ నెల 13, 14 తేదీల్లో జమ్మూకాశ్మీర్​, హిమాచల్​ ప్రదేశ్​, ఉత్తరాఖండ్​లో ఉరుములతో కూడిన వర్షాలు, హిమపాతం కురుస్తుందని.. పంజాబ్​, హర్యానా, ఛండీగఢ్​, ఉత్తరప్రదేశ్​, రాజస్థాన్​లో ఈ నెల 13న, అంటే బుధవారం.. మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 
 
ఉత్తరాది రాష్ట్రాలతో పాటు ఒడిశాలో కూడా ఈ నెల 14 నుంచి 17 వరకు వర్షాలు కురుస్తాయని ఐఎండీ స్పష్టం చేసింది. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో వేడి వాతావరణమే ఉండొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు