నవరాత్రులు.. బొమ్మల కొలువులో ఏయే బొమ్మలు పెట్టాలంటే..?

శుక్రవారం, 12 అక్టోబరు 2018 (11:40 IST)
నవరాత్రులకు కొలువు పెట్టడం అనేది ఆనవాయితీ. కొలువుకు తొమ్మిది మెట్లు తయారుచేసుకోవాలి. కనుక కొలువును ఈ తొమ్మిది మెట్లలో ఎలా మెుదటి నుండి చివరి వరకు వేటిని అమర్చుకోవాలో తెలుసుకుందాం.
 
మెుదటి మెట్టు: గడ్డి, చెట్లు మెుదలగు బొమ్మలు.
రెండవ మెట్టు: నత్త, శంఖు వంటి బొమ్మలు.
మూడవ మెట్టు: చీమల బొమ్మలు.
నాలుగవ మెట్టు: ఎండ్రకాయ వంటి బొమ్మలు.
ఐదవ మెట్టు: జంతువులు, పక్షులు బొమ్మలు.
ఆరవ మెట్టు: మనిషి బొమ్మలు.
ఏడవ మెట్టు: రుషుల బొమ్మలు.
ఎనిమిదవ మెట్టు: దేవతల అవతారాలు, నవగ్రహ అధిపతులు, పంచభూత దేవతలు, అష్టదిక్పాలకుల బొమ్మలు పెట్టాలి. 
తొమ్మిదవ మెట్టు: బ్రహ్మ, విష్ణు, శివ, త్రిమూర్తులు వారి అర్ధాంగియైన సరస్వతి, లక్ష్మి, పార్వతి బొమ్మలు అమర్చడం మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు