బావతో మూడు రాత్రులు, పెళ్ళి చేసుకుని భర్తతో ఏడురోజుల కాపురం, ఆ తరువాత?

బుధవారం, 6 మే 2020 (22:50 IST)
బావతో ప్రేమ. అయితే అతనంటే ఇష్టంలేని కుటుంబ సభ్యులు వేరే వ్యక్తితో పెళ్ళి చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆ యువతి బావకు దగ్గరైంది. బావతో శారీరకంగా కలిస్తే గర్భవతి అవుతుందని తనకు తెలుసు. అయినా మూడురాత్రులు అతనితోనే గడిపింది.
 
ఆ తరువాత పెద్దలు కుదుర్చుకున్న పెళ్ళి చేసుకుంది. సరిగ్గా వారం రోజులు భర్తతో కాపురం చేసింది. అప్పుడే ఆమెకు వాంతులు వచ్చాయి. భర్త షాకయ్యాడు. ఇంత తొందరగా ఎలా భార్య వాంతులు చేసుకుందో అర్థం కాలేదు. వైద్యురాలి దగ్గరకు తీసుకెళ్ళాడు. పరీక్ష చేసి అసలు విషయం చెప్పింది వైద్యురాలు.
 
ఆ తరువాత జరిగిన విషయాన్ని భర్తకు చెప్పింది భార్య. దీంతో లబోదిబోమంటూ భర్త పంచాయతీ పెట్టాడు. విడాకులు తీసుకుంటానని భార్యను తన తల్లిదండ్రుల ఇంటిలో వదిలి వెళ్ళిపోయాడు. ఇక బావను పెళ్ళి చేసుకుంటామని ఆ యువతి సంతోషపడింది. అయితే వారంరోజుల పాటు వేరే వ్యక్తిని పెళ్ళి చేసుకుని సంసారం చేసిన మరదలిని తాను పెళ్ళి చేసుకోనన్నాడు బావ. ఈ సంఘటన నానక్‌పూరాలో చోటు చేసుకుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు