మే 8 నాటికి తెలంగాణా కరోనా ఫ్రీ స్టేట్ : కేటీఆర్ ఆశాభావం

గురువారం, 30 ఏప్రియల్ 2020 (09:20 IST)
మే 8వ తేదీ నాటికి తెలంగాణా కరోనా ఫ్రీ రాష్ట్రంగా అవతరిస్తుందన్న ఆశాభావాన్ని ఆ రాష్ట్ర మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు. ఎందుకంటే.. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసులలో గణనీయమైన తగ్గుదల ఉందన్నారు. బుధవారం కూడా కేవలం ఏడు కేసులు మాత్రమే నమోదయ్యాయని గుర్తుచేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందన్నారు. పైగా, ఇప్పటికే ఈ వైరస్ బారినపడినవారంతా మే 7వ తేదీ లోపు డిశ్చార్జ్ కావొచ్చన్నారు. అందువల్ల మే 8వ తేదీ నాటికి తెలంగాణ కరోనా రహిత రాష్ట్రంగా ఆవిర్భవించవచ్చని ఆయన చెప్పుకొచ్చారు. 
 
కరోనా వైరస్ తర్వాత లగ్జరీ జీవితం కంటే.. ప్రజల ప్రాణాలు ఎంతో ముఖ్యమన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని చెప్పారు. అలాగే, కరోనా లాక్‌డౌన్ సమయంలోనూ రైతులను ఆదుకునేందుకు వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా ఏడు వేల ధాన్య సేకరణ కేంద్రాలను తెరిచివుంచినట్టు ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు