"ఆదిపురుష్" చిత్రంలో 'సీత'గా "మహానటి" (video)

గురువారం, 20 ఆగస్టు 2020 (09:34 IST)
టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించనున్న చిత్రం ఆదిపురుష్. రూ.350 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో నిర్మించనున్నారు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని డెరెక్ట్ చేయనున్నాడు. 
 
అయితే, ఈ చిత్రానికి సంబంధించిన పలు విశేషాలు వెల్లడయ్యాయి. ఈ చిత్రం పురాణ కథ ఆధారంగా రూపొందుతుందని అంటున్నారు. విష్ణు అవతారమైన రాముడి పాత్రను పోలిన పాత్రను ఇందులో ప్రభాస్ పోషిస్తాడని తెలుస్తోంది. రామాయణాన్ని నేటి సాంఘిక పరిస్థితులకు అన్వయిస్తూ ఈ చిత్రం రూపొందుతుందని అంటున్నారు. అంటే సోషియో ఫాంటసీగా కూడా వుండే అవకాశాలు వున్నాయని చెప్పచ్చు. 
 
ఇక ఇందులో రాముడి పాత్రను ప్రభాస్ పోషిస్తుండగా, అతని సరసన సీతాదేవి వంటి పాత్రను ఎవరు పోషిస్తారనే విషయం ఇప్పుడు అందరిలోనూ కుతూహలాన్ని రేపుతోంది. ఈ నేపథ్యంలో ఆ పాత్రకు కీర్తి సురేశ్‌ని చిత్ర నిర్మాతలు పరిశీలిస్తున్నట్టు తాజాగా ప్రచారం జరుగుతోంది. మహానటి చిత్రంలో ఈమె తన ప్రతిభను నిరూపించుకున్న విషయం తెల్సిందే. అయితే, ఇందులో వాస్తవం ఎంతన్నది త్వరలోనే తెలుస్తుంది. 

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు