నాకు అంత ఇస్తేనే, 'ఆచార్య'కు మొహమాటం లేకుండా చెప్పేసిందట బుట్టబొమ్మ (video)

శుక్రవారం, 29 జనవరి 2021 (15:24 IST)
అల వైకుంఠపురంతో పూజాహెగ్డె స్టార్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆమె పారితోషికం ఎంత అడిగితే అంత ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు నిర్మాతలు. ఇపుడు ఆచార్య చిత్రం వంతు వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన నటించే నాయిక ఎవరన్నది ఇప్పటివరకూ క్లారిటీ లేదు.
 
ఐతే మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ ఫిక్సయింది. చెర్రీకి జోడీగా నటించే తార కోసం సెర్చ్ చేసి చివరకు బుట్టబొమ్మ పూజా అయితే కరెక్టుగా సూటవుతుందని కొరటాల డిసైడ్ అయ్యారట. దాంతో ఆమెను సంప్రదించగా, తను ఓకే చెప్పిందట.
 
పాత్ర నిడివి చాలా తక్కువగా వున్నప్పటికీ పారితోషికం మాత్రం ఫుల్ లెంగ్త్ హీరోయిన్‌గా ఎంత తీసుకుంటుందో అంత అడిగిసేందట మొహమాటం లేకుండా. దానితో తొలుత నిర్మాతలు బిత్తరపోయినప్పటికీ మైండ్ లో బుట్టబొమ్మను ఫిక్స్ కావడంతో ఇక చేసేది లేక ఎంత అడిగితే అంత ఇచ్చేందుకు నిర్మాతలు ఓకే చెప్పేసారట. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కెర్లు కొడుతోంది.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు