దోసెలు వేయడం నేర్చుకున్నా.. వర్కౌట్ కాలేదు.. అందుకే ఈ పని చేస్తున్నా... ఆదాశర్మ

సోమవారం, 14 సెప్టెంబరు 2020 (14:49 IST)
తెలుగులో ఐరన్ లెగ్‌గా పేరబడిన హీరోయిన్లలో ఆదాశర్మ వరకు 2008లో విడుదలైన హారర్ చిత్రం '1920'తో వెండితెరకు పరిచయమైంది. ఈ అమ్మడు అప్పటినుంచి ఇండస్ట్రీలో ఉంది. కానీ, ఆమె ఖాతాలో ఒక్కటంటే ఒక్కటి కూడా సరైన హిట్ లేదు. పైగా, హీరోయిన్‌గా చేసిన అన్ని సినిమాలు ఫట్ మన్నాయి. అందుకే, ఈమెకు హీరోయిన్ కంటే.. సైడ్ హీరోయిన్ (రెండో హీరోయిన్) పాత్రలే అధికంగా వరించాయి. అయినప్పటికీ ఇండస్ట్రీ నుంచి వైదొలగిపోలేదు. అడపాదడపా వస్తున్న పాత్రలు చేసుకుంటూ తనలోని నైపుణ్యానికి పదునుపెడుతోంది.
 
ఇందులోభాగంగా కరోనా లాక్డౌన్ వేళ ఈ అమ్మడు దోసలు వేసి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది వర్కౌట్ కాలేదు. అందుకే మరో విషయంలో తన ప్రావీణ్యతను సత్తా చాటేందుకు నిర్ణయించుకుని పియానో పట్టుకుంది. ఇదే అంశంపై ఈ సిక్కిం సుందరి స్పందిస్తూ, 'సినిమాలు లేకపోతేనేం నేను మరో విషయంలోనూ ప్రావీణ్యతను సంపాదించుకుంటున్నాను' అని చెప్పుకొచ్చింది.
 
తాజాగా ఈమె పోస్ట్‌ చేసిన ఓ వీడియో నెటిజన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఇంతకూ ఆ వీడియోలో ఏముందో తెలుసా? ఆదాశర్మ పియానో ప్లే చేసింది. ''నెపోటిజం లేదా ఫేవరేటిజం ఏదైనా కానీ.. సినిమా రంగం నుండి నన్ను బయటకు పంపేసినా, మరో ప్రొఫెషనల్‌గా పియానో నేర్చుకున్నాను. ఇంతకు ముందు దోసలు వేయడం నేర్చుకున్నా.. అదేమీ వర్కవుట్‌ కాలేదు. మీరు నాకు కావాల్సినంత ప్రేమను అందించినందుకు ధన్యవాదాలు. నేను నటిగానే సినిమాల్లో కొనసాగడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే అది నా కల" అంటూ అందులో ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు