సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది హత్యే.. ఆత్మహత్య కాదు.. వీడియో వైరల్

సోమవారం, 3 ఆగస్టు 2020 (13:56 IST)
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా సుశాంత్ మరణంపై ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేపుతుంది. ప్రముఖ డెర్మటాలజిస్ట్ డా. మీనాక్షి మిశ్రా సుశాంత్ ది ఆత్మహత్య కాదు.. హత్య అంటూ.. సుశాంత్ మరణించిన తర్వాత తీసిన ఫోటోలని ఒక్కొక్కటిగా చూపిస్తూ వాటిపై తన వాదనని వినిపించింది. 
 
సుశాంత్ ముఖంపై, ఇతర భాగాల్లో గాయాలు కనిపిస్తున్నాయి. అలాగే ఉరి వేసుకున్నపుడు బాధితుడి శరీరంపై మార్పులను గురించి కూడా ఇందులో ప్రస్తావించారు. అనేక పలు అనుమానాలను వ్యక్తం చేశారు. 
 
కొద్ది రోజుల కిత్రం సుశాంత్‌ది ఆత్మహత్య కాదు.. కచ్చితంగా హత్యే అంటూ సంచలన రేపిన మాజీ కేంద్రమంత్రి సుబ్రహ్మణ్య స్వామి చేసిన పోస్ట్‌ను రీ ట్వీట్ చేయడం విశేషం. దీంతో ఈ కేసులో పలు అనుమానాలు రేకెత్తిస్తుంది.

రక్షాబంధన్‌ సందర్భంగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరి భావోద్వేగ పోస్ట్ షేర్ చేశారు. శ్వేతాసింగ్ కీర్తి రాఖీ పర్వదినం సందర్భంగా తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రాఖీ శుభాకాంక్షలు.. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం..నువ్వు ఎప్పటికి మాకు గర్వకారణమే అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా గత జ్ఞాపకాల ఫోటోలను షేర్ చేశారు.

Shocking relevations made on Sushant’s case!

PS: Sensitive Content. pic.twitter.com/r0orseM72b

— Dr.Minakshi Mishra (@savethesaviours) August 2, 2020

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు