ఆషాఢం తర్వాత పెళ్లి పీటలెక్కనున్న హీరో నితిన్ (video)

శుక్రవారం, 26 జూన్ 2020 (15:16 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో మోస్ట్ బ్యాచిలర్ హీరోల్లో ఒకరైన్ నితిన్ ఆషాఢం మాసం తర్వాత పెళ్లిపీటలెక్కనున్నారు. నిజానికి గత ఏప్రిల్ 16వ తేదీనే శాలిని అనే యువతితో నితిన్ వివాహం జరగాల్సివున్నది. కానీ, కరోనా లాక్డౌన్ కారణంగా దీన్ని వాయిదావేశారు. ఆ తర్వాత మే నెలలో ఈ పెళ్లిని జరుపుకునేందుకు ప్రయత్నించినప్పటికీ కేంద్రం మరోమారు లాక్డౌన్‌ను పొండగించింది. దీంతో ఆయన తన వివాహాన్ని నిరవధికంగా వాయిదావేసుకున్నారు. 
 
ఈ పరిస్థితుల్లో లాక్డౌన్‌తో సంబంధం లేకుండా తన ప్రియురాలు శాలినితో ఆషాఢం మాసం తర్వాత వివాహం జరుపుకునేందుకు సిద్ధమయ్యాడు. క‌రోనా విజృంభ‌ణ ఇప్ప‌ట్లో త‌గ్గేలా క‌నిపించ‌డం లేదు. దీంతో నితిన్ పెళ్లిని ఆషాడం పూర్తి అయిన వెంటనే జరిపేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు స‌మాచారం. 
 
హైదరాబాద్ శివారులో ఉన్న ఒక ఫామ్ హౌస్‌లో పెళ్లికి సిద్ధం అవుతున్నారు. అతి కొద్ది మంది బంధు మిత్రులను ఈ పెళ్లికి నితిన్ అండ్ ఫ్యామిలీ ఆహ్వానించబోతున్నారు. జులై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో నితిన్ షాలినిల వివాహం జరిగే అవకాశం ఉందని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తుంది. 

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు