అదిరింది... ధనరాజ్ నోరు అలా మూయించిన శ్రీముఖి

శుక్రవారం, 30 అక్టోబరు 2020 (22:47 IST)
హాట్ యాంకర్ శ్రీముఖి మరోసారి తన పదునైన మాటలతో ధనరాజ్ నోరు మూయించింది. జబర్దస్త్ షోలో ధనరాజ్ ఎన్నిసార్లు ఎంట్రీ ఇచ్చాడు. ఎన్నిసార్లు వెళ్ళాడో అందరికీ తెలుసు. అయితే ఆ తరువాత పూర్తిగా షోలో వారి స్థానాన్ని కోల్పోయారు. 
 
జబర్దస్త్ నుంచి వచ్చిన ధనరాజ్, వేణులు ప్రస్తుతం అదిరిందిలో సందడి చేస్తూనే ఉన్నారు. తాజాగా బొమ్మ అదిరింది ప్రోమో రిలీజ్ అయ్యింది. అందులో వేణు, ధనరాజ్‌లు ఒక స్కిట్ వేశారు. స్కిట్లో శ్రీముఖి సీటుపై అందరి కన్ను పడిందంటూ సెటైర్ వేశాడు. 
 
కానీ ఆ సీటు మా ఆవిడకు కావాలి అంటూ శ్రీముఖిని కోరతాడు. కొద్దిగా గ్యాప్ ఇవ్వొచ్చు కదా అంటూ శ్రీముఖిని ప్రాధేయపడతాడు. అంతే ఒక్కసారిగా శ్రీముఖి గ్యాప్ ఇస్తే ఎలా ఉంటుందో నీకు తెలుసుకదా. ఎంతోమంది వచ్చేస్తారు. అది నీకు బాగా తెలుసునంటూ గతంలో ధనరాజ్ ఎదుర్కొన్న పలు సమస్యలను ఎత్తిచూపే విధంగా డైలాగ్ వదిలింది శ్రీముఖి.
 
దీంతో ధనరాజ్‌కు నోట మాట రాలేదు. ఇప్పుడిదే విషయంపై పెద్ద చర్చే జరుగుతోంది. అదిరింది షో కాస్త బాగానే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు