కోవిడ్‌తో నటి దివ్యా భట్నాగర్ మృతి.. అధిక రక్తపోటుతో ఆస్పత్రికి వెళ్లి..?

సోమవారం, 7 డిశెంబరు 2020 (10:45 IST)
Divya
టీవీ ప్రముఖ నటి దివ్యా భట్నాగర్ (34) సోమవారం ఉదయం కరోనాతో ముంబై నగరంలోని సెవెన్ హిల్సు ఆసుపత్రిలో కన్నుమూశారు. వారం రోజుల క్రితం టీవీ నటి దివ్యాభట్నాగర్‌కు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. 
 
హైబీపీ సమస్యతో బాధపడుతున్న దివ్యా భట్నాగర్‌కు కరోనా సోకి గత నెల ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అధిక రక్తపోటుతోపాటు నిమోనియాతో బాధపడుతున్న దివ్యాకు వైద్యులు వెంటిలేటరుపై ఉంచి చికిత్స అందించారు. 
 
తేరే యార్ హూ మైనే షూటింగులో నుంచి దివ్యా అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరారు. దివ్యా యే రిష్టా క్యా కహలేతా హై, సంస్కార్, సన్వారీ సబ్ కో ప్రీతో షోలలో దివ్యా పాల్గొన్నారు. ఈమె ఎక్కువగా టీవీ సీరియళ్లలో నటించింది. ఏ రిస్తా క్యా ఖేల్తా హై అనే సీరియల్ ద్వారా పాపులర్ అయిన ఈ నటి గత నెల చివరిలో కరోనా వైరస్ బారిన పడ్డారు. అప్పటి నుంచి ఆమెకు వెంటిలేటర్ మీదనే చికిత్స అందిస్తున్నారు. 
 
అయితే సోమవారం తెల్లవారు జామున మరణించినట్లుగా సమాచారం అందుతోంది. ఆసుపత్రిలో చేర్చిన సమయంలో దివ్య తల్లి మాట్లాడుతూ వారంరోజులుగా దివ్య జ్వరంతో బాధ పడుతోందని ఆక్సీ మీటర్ తో చెక్ చేస్తే ఆమె ఆక్సిజన్ 71కి పడిపోవడంతో ఆమెను హాస్పిటల్‌కి తరలించారని పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు