Work From Home: 87 శాతం సంస్థలు శాశ్వతంగా ఉద్యోగులను ఇంటికే...

మంగళవారం, 30 మార్చి 2021 (17:50 IST)
Work From Home.. కరోనావైరస్ కారణంగా లాక్ డౌన్ విధించిన తర్వాత ఉద్యోగులకు సంస్థలు ఇచ్చిన ఆప్షన్ వర్క్ ఫ్రమ్ హోమ్. దీనిని సక్రమంగా చేసేవారు తమ ఉద్యోగాలను నిలుపుకోగా, తేడా చేసినవారు కోల్పోయారు. ఐతే దాదాపు అధికులు వర్క్ ఫ్రమ్ హోమ్ విధులను సక్రమంగా నిర్వహించినట్లు పలు సంస్థలు సంతృప్తిని వ్యక్తం చేశాయట.
 
దీనితో సుమారు 87 శాతం సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ శాశ్వత ప్రాతిపదికన నిర్ణయం తీసుకునేందుకు సమాయత్తం అవుతున్నట్లు బీసీజీ-జూమ్ నిర్వ‌హించిన తాజా సర్వేలో తేలింది. క‌రోనా కాలంలో ఇంటి నుంచి ప‌ని చేసే వారి సంఖ్య మూడు రెట్లు పెరిగిందనీ, కంపెనీలకు లాభాలు కూడా వచ్చాయని తేలింది.
 
ప్ర‌పంచంలో భారతదేశంతో స‌హా యూఎస్‌, యూకే, జ‌పాన్‌, ఫ్రాన్స్, జ‌ర్మ‌నీల‌లో నిర్వహించిన ఈ సర్వేలో 87 శాతం సంస్థలు తమ ఉద్యోగులను శాశ్వాత ప్రాతిపదికన వర్క్ ఫ్రమ్ హోమ్ కి ప్రాధాన్యతనివ్వనున్నట్లు తేలింది. స‌ర్వేలో పాల్గొన్న మేనేజ‌ర్ స్థాయి ఉద్యోగుల్లో 70 శాతం మంది రిమోట్ వ‌ర్కింగ్‌కు అనుకూలంగా ఓటేశారు. మొత్తమ్మీద వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అటు ఉద్యోగులకు ఇటు కంపెనీలకు మంచే చేసినట్లు తెలుస్తోంది. ఐతే కొన్ని కంపెనీలు మాత్రం మూతపడ్డాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు