పేదల భూములను లాక్కొని.. తిరిగి వారికే పంచుతున్నారు

బుధవారం, 26 ఫిబ్రవరి 2020 (07:33 IST)
జగన్ పేదల భూములను లాక్కొని.. తిరిగి వారికే పంచుతున్నారని టీడీపీ నేత లోకేశ్ మండిపడ్డారు. ఇది జగన్ రివర్స్ టెండరింగ్​కు పరాకాష్ట అని ఆయన ఎద్దేవా చేశారు.

గతంలో ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన భూములను జగన్ లాక్కొని ఇళ్లస్థలాల పేరిట తిరిగి వాళ్లకే పంచుతున్నారని లోకేశ్ ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ఇది జగన్ రివర్స్ టెండరింగ్​కు పరాకాష్ట అని ఎద్దేవా చేశారు.

పథకాల మార్పుకోసం పేదలు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను ఎందుకు లాక్కుంటున్నారని ప్రశ్నించారు.

జగన్ అక్రమంగా సంపాదించిన వేల ఎకరాల ఎస్టేట్​లు, ప్యాలెస్​లు ప్రభుత్వానికి ఇవ్వాలన్నారు. తద్వారా లక్షల మంది పేదలకు ఇళ్లస్థలాలు వస్తాయన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు