మద్యం మత్తులో మైనర్‌పై అత్యాచారం.. ఇంటికి తీసుకెళ్లి..?

సెల్వి

గురువారం, 28 మార్చి 2024 (13:54 IST)
మద్యం మత్తులో ఓ కీచకుడు దారుణానికి పాల్పడ్డాడు. మైనర్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో ఉన్న నిందితుడు బాలికను తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బారాబంకిలోని గ్రామంలో ఆరేళ్ల బాలికపై ఆమె పొరుగువారు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు  తెలిపారు. బుధవారం సాయంత్రం బాలిక తన ఇంటి బయట నిందితుడు ఆనంద్ కుమార్తెతో ఆడుకుంటున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
 
మద్యం మత్తులో ఉన్న నిందితుడు బాలికను తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.  నిందితుడిపై ఇండియన్ పీనల్ కోడ్ 376 (రేప్), పోక్సో చట్టం కింద ఫతేపూర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. బాలికను ఆసుపత్రికి తరలించామని, ఆమె పరిస్థితి ప్రమాదకరంగా లేదని సర్కిల్ అధికారి బీను సింగ్ తెలిపారు. నిందితుడిని అరెస్టు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు