భార్య డెలివరీకి పుట్టింటికి వెళితే మరదలితో భర్త ఎంజాయ్, చివరికి?

మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (19:31 IST)
డెలివరీ కోసం భార్య పుట్టింటికి వెళ్ళింది. మరదలు చదువుకునేందుకు ఇంటికి వచ్చింది. లాక్ డౌన్ కావడంతో ఇంట్లోనే ఉండిపోయింది. డెలివరీ కోసం వెళ్ళిన భార్య రావడానికి సమయం పడుతుందని మరదలికి మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. ఎంజాయ్ చేశాడు. చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.
 
హైదరాబాద్ నగరంలోని హఫీజ్ బాబానగర్ ఆక్తర్ ఫంక్షన్ హాల్ సమీపంలో సంతోష్, రాణిలు నివాసముండేవారు. సంవత్సరం క్రితమే వీరికి పెళ్ళయ్యింది. అన్యోన్యంగా ఉన్నారు. ఆర్థికంగా సంతోష్ బాగా ఉండడంతో లాక్ డౌన్ సమయంలోను ఇంటి పట్టునే ఉన్నాడు. 
 
అయితే లాక్ డౌన్‌కు ముందు మరదలు సంతోష్ ఇంటికి వచ్చింది. విద్యనభ్యసించేందుకు సంతోష్ ఇంటికి పంపారు జ్యోతిని. సంతోష్‌కు పెళ్ళయినా జ్యోతి మాత్రం అతనిపై మనస్సు పడింది. ఎప్పుడు రాణి ఇంటి నుంచి వెళుతుందా అని కాచుకు కూర్చుంది. 
 
డెలివరీ కోసం నెల క్రితం పుట్టింటికి వెళ్ళింది రాణి. ఇదే అదునుగా సంతోష్, జ్యోతిలు బాగా సన్నిహితమయ్యారు. వారి రాసలీలలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. స్థానికుల ద్వారా విషయం అత్తింటివారికి తెలిసింది. మారమన్నారు. మారలేదు.
 
దీంతో సంతోష్‌ను బావమరిది స్కెచ్ వేసి తన స్నేహితులతో కలిసి హత్య చేశారు. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడంటూ చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ పోలీసుల విచారణలో విషయం బయటపడింది. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు