అమేజాన్ ఈవెంట్‌లో ఒకే వేదికపై సమంత-చైతూ.. ఇద్దరూ కలిశారా?

సెల్వి

బుధవారం, 20 మార్చి 2024 (11:00 IST)
Samantha Ruth Prabhu and Naga Chaitany
టాలీవుడ్ స్టార్స్ సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ విడాకులతో విడిపోయి రెండున్నరేళ్లు దాటింది. అయినా వారిద్దరూ తిరిగి కలిసిపోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. విడాకుల తర్వాత ఇద్దరూ మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయారు. అయితే తాజాగా వీరిద్దరూ కలిసి ఒకే వేదికను పంచుకున్నారు. 
 
ముంబైలో జరిగిన ఓ కార్యక్రమానికి సమంత , నాగచైతన్య ఇద్దరూ హాజరయ్యారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఇద్దరూ ఒకే ఈవెంట్‌కు వచ్చినా వేదికపైకి మాత్రం వేర్వేరు సందర్భాల్లో వచ్చారు.
 
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్‌ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నాగ చైతన్య నటించిన ‘ధూత’ వెబ్ సిరీస్ విడుదలైంది. అదేవిధంగా సమంత నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 కూడా అదే ఓటీటీలో భారీ వ్యూస్ సొంతం చేసుకుంది. ఇప్పుడు సమంత నటించిన సిటాడెల్ హనీ బానీ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే స్ట్రీమింగ్ కానుంది.
 
తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ నిర్వహించిన విలేకరుల సమావేశంలో సమంత, నాగ చైతన్య, వరుణ్ ధావన్ పాల్గొన్నారు. ధూత వెబ్ సిరీస్ విజయంపై నాగచైతన్య మాట్లాడారు. ఆపై సిటాడెల్ హనీ బానీ వెబ్ సిరీస్ గురించి మాట్లాడేందుకు సమంత వేదికపైకి వచ్చింది. ట్విస్ట్ ఏమిటంటే, వారిద్దరూ వేర్వేరు సందర్భాలలో వేదికపై కనిపించారు. కలిసి మాత్రం రాలేదు. దీంతో చైతూ-సమ్మూ ఫ్యాన్స్ నిరాశను వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు