పుష్ప-2 ఐటమ్ సాంగ్‌.. జాన్వీ కపూర్ ఊ.. అంటుందా..?

సెల్వి

శనివారం, 2 మార్చి 2024 (08:52 IST)
పుష్ప-2 ఐటమ్ సాంగ్‌కి రోజుకో వార్త సోషల్ మీడియాలో పుట్టుకొస్తూనే వున్నాయి. పుష్ప-2లో ఐటమ్ సాంగ్ కోసం ఇప్పటికే పలువురు హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ను మేకర్స్ సంప్రదించినట్లు తెలుస్తోంది. 
 
అల్లు అర్జున్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న పుష్ప 2: రూల్‌లో ఐటెం సాంగ్ భారీగా ప్లాన్ చేస్తున్నారు. దక్షిణాది టాప్ హీరోయిన్ సమంత రూత్‌ ప్రభు పుష్పలో "ఊ అంటావా" ఐటెం సాంగ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.  
 
ఈసారి సామ్ కాకుండా.. ట్రెండింగ్ హీరోయిన్‌ను రంగంలోకి దించాలని ప్లాన్ చేస్తున్నారు సుకుమార్. ఇందుకోసం నటి జాన్వీ కపూర్‌ని పరిశీలిస్తున్నారు. జాన్వీ కపూర్‌తో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. పారితోషికం వర్కౌట్ అయితే.. జాన్వీ ఈ పాటకు ఓకే చెప్పేలా వున్నట్లు సమాచారం. 
 
పుష్ప 2 విడుదలకు దగ్గరవుతున్నందున, త్వరలో పాట షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ యాక్షన్ దేవరలో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు