ప్రియుడు శిఖర్ పహారియాతో కలిసి మోకాళ్ళపై తిరుమల మెట్లెక్కిన జాన్వీ కపూర్...

ఠాగూర్

గురువారం, 21 మార్చి 2024 (16:53 IST)
దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ టాలీవుడ్‌లో బిజీ అవుతున్నారు. తన మొదటి చిత్రంలోనే జూనియర్ ఎన్టీఆర్‌ సరసన నటిస్తున్న జాన్వీ.. తాజాగా రామ్ చరణ్ నటించే 16వ చిత్రంలోనూ హీరోయిన్‌గా ఎంపికయ్యారు. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం హైదరాబాద్ నగరంలో అంగరంగ వైభవంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హాజరై తొలి క్లాప్ కొట్టారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రానికి బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నారు. 
 
ఇదిలావుంటే, జాన్వీ కపూర్‌కు శ్రీవారిని క్రమం తప్పకుండా దర్శించుకుంటున్నారు. ఈ నెల 6వ తేదీన కూడా జాన్వీ తన పుట్టిన రోజు వేడుకల సందర్భంగా తన స్నేహితులతో కలిసి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఇలా స్వామి వారి సేవలో పాల్గొన్న సమయంలో తీసిన ఓ వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో తన తిరుమల యాత్ర ఎలా జరిగిందో ఆమె వివరించారు. చెన్నైలోని జాన్వీ కపూర్ ఇంటి నుంచి కారులో మూడు గంటల ప్రయాణం తర్వాత తిరుమలకు చేరుకున్నట్టు చెప్పారు. 
 
ఆ తర్వాత జాన్వీ కపూర్ తన బంధువులతో కలిసి నడక దారిన తిరుమల చేరుకున్నామని తెలిపింది. ఈ క్రమంలో మోకాళ్ల మిట్ట వద్ద జాన్వీ - తన ప్రియుడు శిఖర్ పహారియాతో కలిసి మోకాళ్లపై మెట్లెక్కారు. దాదాపు 50 సార్లు తాను ఇక్కడకు వచ్చినట్టు తెలియజేశారు. ఈ దేవాలయం అంటే తనకు ఎంతో ఇష్టమని ఆమె పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు