అయోధ్య రామాలయంలో ప్రియాంక చోప్రా దంపతులు.. మెరిసిన మాల్తీ

సెల్వి

గురువారం, 21 మార్చి 2024 (18:37 IST)
Priyanka Chopra
నటి ప్రియాంక చోప్రా జోనాస్, ఆమె భర్త, అమెరికన్ గాయకుడు నిక్ జోనాస్ తన పుత్రికతో కలిసి అయోధ్యను సందర్శించుకున్నారు. ప్రియాంక చోప్రా రెండేళ్ల కుమార్తె మాల్తీ మేరీ జోనాస్‌తో కలిసి అయోధ్యలోని రామమందిరంలో పూజలు చేశారు.
 
పసుపు రంగు చీర ధరించిన ప్రియాంక చోప్రా, కుర్తాలో నిక్ జోనాస్, పీచ్ కలర్ గౌనులో మాల్తీలకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రామయ్య దర్శనం, పూజల తర్వాత ఆలయ పూజారుల నుంచి తీర్థప్రసాదాలు అందుకున్నారు. పూజారుల ఆశీస్సులు తీసుకున్నాక వారితో కలిసి ఫొటోలకు ఫోజిచ్చారు.
 
అంతకుముందు రోజు, ఈ స్టార్ జంట తమ కుమార్తెతో అయోధ్య విమానాశ్రయంలో ఫోటోలకు ఫోజులిచ్చారు. 
 
జనవరి 22న జరిగిన మహా సంప్రోక్షణ మహోత్సవం తర్వాత వారు రామమందిరాన్ని ప్రియాంక చోప్రా సందర్శించడం ఇదే తొలిసారి. ఈ వేడుకకు అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, అలియా భట్-రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ రిషబ్ శెట్టితో సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఇకపోతే.. ప్రియాంక చోప్రా మంగళవారం ముంబైలో జరిగిన ప్రైమ్ వీడియో ప్రెజెంట్స్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన రాబోయే ప్రాజెక్టు "విమెన్ ఆఫ్ మై బిలియన్" డాక్యుమెంటరీని వివరాలను మీడియాతో షేర్ చేశారు.

Never forget your roots pic.twitter.com/UXT9WSgcwx

— Ayodhya Dham Parody (@BhaktiDarshan_) March 21, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు