పెళ్లి పీటలెక్కనున్న రకుల్ ప్రీతి సింగ్!?

వరుణ్

మంగళవారం, 16 జనవరి 2024 (11:19 IST)
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి పీటలెక్కనున్నట్టు జోరుగా ప్రచారం సాగుతుంది. గత కొంతకాలంగా డేటింగ్ ఉన్న తన ప్రియుడైన నటుడు జాకీ భగ్నాని వివాహం చేసుకోనున్నారని, వీరి వివాహం ఈ యేడాది మార్చి నెలలో జరుగనుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. దీనిపై రకుల్ క్లారిటీ ఇచ్చింది. 
 
గత కొంతకాలంగా తాను సింగిల్‌గా ఉన్నానని ఆమె చెప్పారు. భాగస్వామిని కలిగివుండటం ఒక సహజ ప్రక్రియ అని, అయితే దురదృష్టవశాత్తూ సినీ ఇండస్ట్రీలో ఉండేవారిపై చాలా ప్రచారాలు జరుగుతుంటాయని ఆమె చెప్పారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ మనుషులమేనని, అందరికీ భావోద్వేగాలు, బాధలు ఉంటాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
 
జాకీతో ఎమోషనల్ బ్యాలెన్స్‌పై స్పందిస్తూ ఇద్దరం సినిమా రంగానికి చెందినవారమేనని రకుల్ చెప్పింది. తాను స్వతంత్రంగా వ్యవహరించే అమ్మాయినే అయినప్పటికీ జాకీ వద్దకు పరిగెత్తుకెళ్లిన రోజులు ఉన్నాయని తెలిపింది. సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే కావడంతో జాకీ తనను అర్థం చేసుకునేవాడని తెలిపింది. 
 
తామిద్దరం ఎప్పుడూ సినిమాకి సంబంధించిన విషయాలనే కాకుండా ఇతర అంశాల గురించి కూడా మాట్లాడుకునేవాళ్లమని చెప్పారు. ఫిటెనెస్‌కు సంబంధించిన అంశాలపై దృష్టి సారించేవారిమని తెలిపింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ మేరకు వ్యక్తిగత జీవితానికి సంబంధించి తన ఆలోచనలను పంచుకున్నట్టు పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు