ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసిన తర్వాత తనకు వేధింపులు, బెదిరింపులు ఎక్కువయ్యాయని అరకు వైకాపా ఎంపీ కొత్తపల్లి గీత ఆరోపించారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబును తాను అరకు సమస్యలపై కలిసిన మాట్లానట్టు చెప్పారు. అయితే, ఈ సమావేశం తర్వాత తనకు ఫోన్లో బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. ఫోన్ ఇంకెవరైనా ఎత్తితే మౌనమే సమాధానం అవుతోందని చెప్పారు.
అదేవిధంగా ఫేస్బుక్ ఖాతాలో కూడా అసభ్యకరమైన సందేశాలు పోస్టు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేశారు. నిందితుల్ని పట్టుకుని శిక్షిస్తామని హెచ్చరించారు. అయితే ఎంపీపై ఈ రకమైన మానసిక దాడి చేయాల్సిన అసవరం ఎవరికి ఉంటుందంటూ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.