రాజధానిపై జరుగుతున్న గ్లోబెల్ ప్రచారంపై ఆయన స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని గురించి మీడియాలో వస్తున్న వార్తలు నిరాధారమన్నారు. కొత్త రాజధాని విజయవాడ, దొనకొండ, విశాఖ... అంటూ మీడియాలో ప్రచారం జరుగుతోందన్నారు. బాధ్యత లేకుండా మీడియా రాజధానిపై ప్రచారం చేస్తోందని చంద్రబాబు అన్నారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక రానిదే ఏమీ చెప్పలేనని ఆయన అన్నారు.