ఇక్కడి కుషాయిగూడ నాగార్జున నగర్ కాలనీకి చెందిన ఒక కుటుంబంలో భార్య, భర్త, వారికి ఒక కుమారుడు నివాసముంటున్నారు. ఈ స్థితిలో ఇంటి యజమాని అప్పుల పాలయ్యాడు. అప్పలు తీర్చాలని ఒత్తిడి రోజురోజూకు అధికమవుతుంది. రోజు గడవడమే కష్టంగా ఉంది. ఇక అప్పులు తీర్చే మార్గం కనిపించక శుక్రవారం అర్థరాత్రి వారు విషం తాగి భార్య, భర్త, కుమారుడు ప్రాణాలు కోల్పోయారు.
శనివారం ఉదయం వారి ఇంటి తలుపులు తెరువకపోవడంతో అనుమానించిన స్థానికి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన పోలీసులు అక్కడికి చేరుకుని, ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్ల చూడగా ఆ కుటుంబంలోని ముగ్గురు విగతజీవులపై పడి ఉన్నారు.