అనంతపురంలో దారుణం చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో భర్తే ఆమె పాలిట యముడయ్యాడు. భార్యపై అనుమానం పెంచుకున్న ఆ భర్త ఆమెను పాశవికంగా హత్యచేశాడు. ఈ ఘటన జిల్లాలోని కనగానపల్లి మండలం, కుర్లపల్లిలో చోటుచేసుకుంది.
ఇదిలా ఉంటే.. అనంతపురం, గుత్తి మండలంలోని రజాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. గుంతకల్లు నుంచి గుత్తి వస్తున్నఆటో రజాపురం వద్దకు రాగానే అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.