ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై సోమవారం ఓటింగ్ చేపట్టలేమని రాజ్యసభ సభ్యుడు కురియన్ స్పష్టం చేశారు. అయితే, వచ్చే శుక్రవానికి ఒక రోజు ముందుగా ఓటింగ్ చేపట్టేందుకు సిద్ధమని ప్రకటించారు.