బుధవారం నాడు కర్నూలులో జరిగిన మినీ మహానాడులో అఖిలప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డా వెంగళరెడ్డి జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని తెలిపారు.
ఇంకా మాట్లాడుతూ... తన తల్లిదండ్రులు చనిపోవటం వల్ల తను మంత్రినయ్యాననీ, తనలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. గత మహానాడులో నా తండ్రి భూమా నాగిరెడ్డి తన చెయ్యి పట్టుకొని నడిపించారనీ, ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు నడిపిస్తున్నారని అన్నారు.