తూర్పు గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన విద్యా ర్థులు సుదీర్ఘ కాలంగా ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేట విద్యా సంస్థల్లో చదువుకుంటున్నారు. ఇప్పుడు ఆర్టీసీ విభజన తరువాత తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఏపీ విద్యార్థుల పాస్లను నిలిపివేశారు.
తమ భవిష్యత్తుతో ఆర్టీసీ ఆడుకోరాదన్నదే వీరి డిమాండ్. కాని టీ ఆర్టీసీ మాత్రం వీటిని బేఖాతర్ చేసింది. మా నిబంధనలు మాకు ఉన్నాయి, రాఘవాపురం దాటిన తరువాత వెంటనే తెలంగాణ రాష్ట్ర సరిహద్దు వస్తుంది కాబట్టి ఈ ప్రాంతానికి చెందిన విద్యార్థుల పాస్లు చెల్లవన్నదే వారి వాదన.
ఇదిలా ఉంటే స్థానిక నేతలు రంగంలోకి దిగారు. తమ పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్న టీ ఆర్టీసీ ఈ ప్రాంతానికి సర్వీసులు నడపక్కర్లేదని రెండు రోజుల క్రితమే సత్తుపల్లి డిపో బస్సులను వెనక్కి తిప్పి పంపారు. దీంతో పశ్చిమ-ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లో ఎర్రబస్సు వివాదం మరింత ముదిరు పాకాన పడుతోంది. ప్రభుత్వాలు కలుగజేసుకోకపోతే.. కొత్త సమస్యే...