అక్బరుద్దీన్ చట్టం ముందు లొంగిపోతారు : అసద్దుద్దీన్

ఆదివారం, 6 జనవరి 2013 (11:53 IST)
File
FILE
ఎంఐఎం నేత అక్బరుద్దీన్ చట్టం ముందు లొంగిపోతాడని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. శనివారం జరిగిన ఒక బహిరంగ సభలో అసదుద్దీన్ ప్రసంగిస్తూ.. తమకు కాంగ్రెస్, బీజేపీలో ప్రధాన శత్రువులన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలను దెబ్బతీయడమే లక్ష్యంగా పని చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

మరోవైపు. తమ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ లండన్ నుంచి రాగానే చట్టం ముందు లొంగిపోతాడని చెప్పారు. హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచే విధంగా ప్రసంగం చేయలేదని, కొన్ని రాజకీయ పార్టీలు కుట్రపూరితంగా తమపై ఆరోపణలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

వెబ్దునియా పై చదవండి