హైదరాబాద్ ఫ్రీజోన్ అంశంపై రాష్ట్ర అసెంబ్లీలో తమ పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతుందని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిందని, ఫ్రీజోన్ అంశంపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... శ్రీశైలం డ్యామ్ను ఫ్రీజోన్గా ప్రకటిస్తారా?, తిరుపతి, వైజాగ్లను ఫ్రీజోన్గా ప్రకటిస్తారా అని ఆయన ప్రశ్నించారు. అలాగే 21వ తేదీన సిద్ధిపేటలో జరిగే సభ రాజకీయ సభ కాదని ఆయన స్పష్టం చేశారు.