ఆచార్య కోదండరామ్‌పై చర్యలు తీసుకోలేం: రోశయ్య

సోమవారం, 8 మార్చి 2010 (18:00 IST)
అర్థంపర్థం లేని డిమాండ్లు చేస్తున్న తెలంగాణ ఐకాస కన్వీనర్ ఆచార్య కోదండరామ్‌పై చర్య తీసుకోలేమని ముఖ్యమంత్రి కె.రోశయ్య అన్నారు. ఆయన సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆచార్య వృత్తిలో ఉండే కోదండరామ్ ఇష్టానుసారంగా మాట్లాడటం భావ్యం కాదన్నారు. ఏ ప్రాంత ఇంటర్ పరీక్ష జవాబు పత్రాలను ఆ ప్రాంతంలోనే దిద్దాలన్న వాదన అర్థరహితమన్నారు.

దీనిపై అనుమానాలు ఉంటే వారిని తొలగించాల్సిన బాధ్యత నాయకులపైనే ఉందన్నారు. వరంగల్ జిల్లాకు చెందిన డీఎస్పీ నళినికి మానవతాదృక్పథంలోనే తిరిగి పోస్టింగ్ ఇచ్చామని రోశయ్య ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అలాగే, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయన్నారు. ఎన్నికల తేదీలపై అన్ని పార్టీలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు.

వెబ్దునియా పై చదవండి