"ఆరోగ్యశ్రీ"తో పేదలకు కార్పోరేట్ వైద్యం: వైఎస్

ఆదివారం, 10 ఫిబ్రవరి 2008 (16:43 IST)
ఆరోగ్య శ్రీ పథకం ద్వారా రాష్ట్రంలోని నిరుపేదలకు సైతం కార్పోరేట్ వైద్య సేవలు అందించనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు. ఆయన ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తూ.. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రతి జిల్లాకు విస్తరింపజేస్తామని చెప్పారు. పేదలకు పైసా ఖర్చు లేకుండా ఆరోగ్య శ్రీ ద్వారా కార్పొరేట్‌ వైద్యం అందిస్తామన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా తెల్లకార్డు కలిగిన ప్రతి లబ్ధిదారునికి ఈ పథకం కింద కార్పోరేట్ వైద్య సేవలు పొందవచ్చన్నారు. ఆస్పత్రుల్లో పోలీసు రక్షణ కంటే ఆరోగ్యశ్రీ రక్షణే పేదలకు ఉపయోగకరమైనదని కేర్‌ ఆస్పత్రి చైర్మన్‌ డాక్టర్‌ సోమరాజు ప్కేరొన్నారు. ఆరోగ్య శ్రీ వల్ల ఎందరికో పేద వారి రుగ్మతలకు చికిత్స లభిస్తుందన్నారు.

వెబ్దునియా పై చదవండి