ఎంసెట్ పరీక్షలు : తిరుపతిలో హైటెక్ కాపీయింగ్

శుక్రవారం, 10 మే 2013 (20:22 IST)
FILE
శుక్రవారం జరిగిన ఎంసెట్ వైద్య ప్రవేశ పరీక్షల్లో తిరుపతిలో హైటెక్ కాపీయింగ్‌కు కొందరు పాల్పడ్డారు. గతంలో కాపీయింగ్‌కు పాల్పడిన గురివిరెడ్డి బృందం ఈసారి కూడా హైటెక్ కాపీయింగ్‌కు పాల్పడింది. దీనిని గమనించిన ఇన్విజిలేటర్స్ పోలీసులకు సమాచారం అందించి కాపీయింగ్‌కు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్, వైద్య ప్రవేశపరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం ఇంజనీరింగ్ ప్రవేశపరీక్షలు మగిశాయి. మధ్యాహ్నం వైద్య ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. అయితే తిరుపతిలో అప్పట్లో కాపీయింగ్ పాల్పడిన గురివిరెడ్డి బృందం మరోసారి హైటెక్ కాపీయింగ్ పాల్పడింది. కాపీయింగ్‌కు పాల్పడిన గురివిరెడ్డి సోదరి పుష్పగిరి పద్మజ, స్నేహితుడు రాజమెహన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి