జిల్లా కేంద్రమైన నెల్లూరు విజయమహాల్ సెంటర్ వద్ద సోమవారం తెల్లవారు జామున తమిళనాడు ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంలో ఎలాంటి పేలుడు చోటు చేసుకోలేదని ఫోరెన్సిగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తమిళనాడు ఎక్స్ప్రెస్ ఎస్-11 బోగీ అగ్నికీలల్లో చిక్కుకుని 32 మంది సజీవ దహనం కాగా, మరో 27 మంది వరకు గాయపడ్డారు. మరికొందరి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఈ నేపథ్యంలో.. ప్రమాదానికి గురైన ఎస్-11 బోగీని నెల్లూరు స్టేషన్కు తరలించారు.
ఆ బోగీని మంగళవారం ఫోరెన్సిక్ అధికారుల బృందం తనిఖీ చేసింది. ఈ బోగీలో పేలుడు జరిగిందనుకోవడం లేదన్న తెలుస్తోందన్నారు. బోగీలోని ఎలక్ట్రిక్ సంబంధిత పరికరాలన్ని పరిశీలించామని, బోగీ నుంచి శిథిలాలను సేకరించామని, పరీక్షలు జరిపి ప్రమాదానికి గల కారణాలు గుర్తిస్తామని చెప్పారు.