కాకినాడ ఆస్పత్రికి కొవ్వూరు ఎమ్మెల్యే తరలింపు

గురువారం, 23 జులై 2009 (17:39 IST)
బెదిరింపులు, అత్యాచారయత్నం ఆరోపణల కేసులో అరెస్టయిన తెలుగుదేశం పార్టీకి చెందిన కొవ్వూరు ఎమ్మెల్యే రామారావును గురువారం అకస్మాత్తుగా కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆయనకు గుండెనొప్పి ఎక్కువకావడంతో తొలుత రాజమండ్రి ఆస్పత్రికి తరలించారు. అయితే, అక్కడ సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడం వల్ల కాకినాడ ఆస్పత్రికి తీసుకెళ్లినట్టు పోలీసులు వెల్లడించారు.

తన సొంత నర్సింగ్ కళాశాలల్లో చదివే కేరళ విద్యార్థినులపై ఎమ్మెల్యే అత్యాచారానికి పాల్పడినట్టు బాధిత విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐడీ పోలీసులు రామారావును ఇటీవల అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు తరలించిన విషయం తెల్సిందే.

వెబ్దునియా పై చదవండి