కిరణ్ వ్యాఖ్యల్లో తప్పు లేదు : డొక్కా మాణిక్యవరప్రసాద్

శనివారం, 10 ఆగస్టు 2013 (16:01 IST)
File
FILE
రాష్ట్ర విభజన వల్ల ఇరు ప్రాంతాల్లో ఉత్పన్నమయ్యే సమస్యలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యక్తం చేసిన అభిప్రాయాలతో తాను ఏకీభవిస్తున్నట్టు రాష్ట్ర మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ చెప్పారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కిరణ్ ఎప్పటికీ కాంగ్రెస్ అధిష్టానానికి విధేయుడన్నారు.

ఇకపోతే.. రాష్ట్ర విభనల వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను అధ్యయనం చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ఏర్పాటు చేసిన ఆంటోనీ కమిటీకి తమ సమస్యలను వివరిస్తామని చెప్పారు. ముఖ్యంగా.. సీమాంధ్ర ప్రజల భయాందోళనలను వివరిస్తామన్నారు.

ఇకపోతే... చిన్న రాష్ట్రల ఏర్పాటు వల్ల పరిపాలన సౌలభ్యం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై కేంద్రం, హైకమాండ్ తీసుకునే నిర్ణయానికి శిరసావహిస్తానని మాణిక్యవరప్రసాద్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.

వెబ్దునియా పై చదవండి