కేసీఆర్‌‌ను నిమ్స్‌ ఆసుపత్రికి తరలించిన అధికారులు

గురువారం, 3 డిశెంబరు 2009 (11:08 IST)
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావును ఖమ్మం ప్రభుత్వాసుపత్రి నుంచి హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రికి గురువారం తెల్లవారుజామున 108 వాహనంలో తరలించారు.

కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తుండటంతో ఆయనను గురువారం ఉదయం ఖమ్మం ప్రభుత్వాసుపత్రి నుంచి హైదరాబాద్‌‍లోని నిమ్స్ ఆసుపత్రికి గట్టి పోలీసు భద్రత నడుమ తరలించారు. ఆయన ఆంబులెన్స్ వెంట దాదాపు 30 వాహనాలకు పైగా కాన్వాయ్ వెళ్ళింది.

ఈ నేపథ్యంలో ఆయనకు నిమ్స్‌లోని ఐసీఎంయూలో వైద్యులు చికిత్స చేస్తున్నారు. కేసీఆర్‌ను హైదరాబాద్‌ తరలింపు సందర్భంగా అధికారులు నిమ్స్‌ ఆసుపత్రి వద్ద భారీ భద్రతా ఏర్పాటు చేశారు. కేసీఆర్‌ వెంట ఆయన కుమారుడు కేటీఆర్‌, హరీశ్‌రావులున్నారు.

వెబ్దునియా పై చదవండి