కేసీఆర్‌.. ఢిల్లీకి రండి : కాంగ్రెస్ హైకమాండ్ పిలుపు!

శనివారం, 10 డిశెంబరు 2011 (14:58 IST)
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావుకు ఢిల్లీ నుంచి కబురు వచ్చింది. ఈ పిలుపు కాంగ్రెస్ అధినాయకత్వం నుంచి వచ్చింది. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి కేసీఆర్‌కు శనివారం ఫోన్ వచ్చింది. ఫలితంగా కేసీఆర్ రెండు మూడు రోజుల్లో ఢిల్లీ వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

తెలంగాణ అంశంపై కేసీఆర్తో కాంగ్రెస్ అధిష్టానం చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. అయితే ఈ విషయాన్ని తెరాస పార్టీ వర్గాలు మాత్రం ధృవీకరించడంలేదు. కేసీఆర్‌కు కాంగ్రెస్ కోర్ కమిటీ సభ్యుడు అహ్మద్ పటేల్ ఫోన్ చేసి మాట్లాడినట్టు ఢిల్లీ వర్గాల సమాచారం.

వెబ్దునియా పై చదవండి