కేసీఆర్... నరసింహుడు కాదు.. పూలరంగడు : మంత్రి టీజీ

శుక్రవారం, 9 నవంబరు 2012 (11:55 IST)
File
FILE
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు ఉగ్ర నరసింహుడు కాదనీ.. పూలరంగడని రాష్ట్ర మంత్రి టీజీ.వెంకటేష్ అభిప్రాయపడ్డారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర సర్కారే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. అప్పటి వరకు అభివృద్ధిని అడ్డుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ అంశంలో కాంగ్రెస్ మోసం చేసిందనీ, అందువల్ల ఇక ఉగ్ర నరసింహుడిగా మారుతానంటూ కేసీఆర్ చేసిన ప్రకటనపై మంత్రి టీజీ స్పందించారు. కేసీఆర్ పూలరంగడు అనుకుంటే.. నరసింహుడిని చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఇకపోతే.. రాష్ట్రాన్ని దురదృష్టం వెంటాడుతోందన్నారు. సకాలంలో వర్షాలు కురవక, గ్యాస్‌ కొరత రూపంలో దురదృష్టకరం వెంటాడుతోందన్నారు. ఎన్ని పథకాలు చేపట్టినా ప్రచారం కరువైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరెంట్‌ కొరత వల్ల పరిశ్రమలకు నష్టం చేకూరుతుందని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి