గుండెపోటుతో టెక్కలి ఎమ్మెల్యే రేవతీపతి మృతి

శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం ఎమ్మెల్యే రేవతీపతి మంగళవారం మృతి చెందారు. గుండెపోటు రావడంతో నాలుగురోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన రేవతీపతి ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో తుదిశ్వాస విడిచారు.

గుండెపోటు రాగానే రేవతీపతిని హుటాహుటిన హైదరాబాద్ కేర్ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా వైద్యులు రేవతీపతికి అన్ని రకాల వైద్య సేవలు అందించారు. అయితే చికిత్సలు ఫలించకపోవడంతో రేవతీపతి మృతిచెందారు. వైద్యుల వివరాల ప్రకారం క్రమక్రమంగా రక్తపోటు పడిపోవడం, కృత్రిమశ్వాసను సైతం తీసుకోలేకపోవడం తదితర కారణాలవల్లే రేవతీపతి మృతి చెందినట్టు తెలుస్తోంది.

రేవతీపతి మరణవార్త తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబుబులు ఆయనకు తమ సంతాపాన్ని తెలియజేశారు.

వెబ్దునియా పై చదవండి