చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి: న్యాయవాదులు

శనివారం, 6 మార్చి 2010 (18:06 IST)
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద శనివారం న్యాయవాదులపై తెలుగుదేశంపార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో తెదేపా అధినేత చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని తెలంగాణ న్యాయావదుల ఐక్య కార్యాచరణ సమితి డిమాండ్ చేసింది.

తెదేపా అధినేత తమను అనవసరంగా కొట్టించారని, ఈ సందర్భంగా ఆయనపై క్రిమినల్ కేసును నమోదు చేయాలని, అలాగే ఈ నెల ఎనిమిదవ తేదీన విధులు బహిష్కరించాలని తెలంగాణ ప్రాంతానికి చెందిన న్యాయవాదుల ఐక్య కార్యాచరణ సమితి శనివారం నిర్ణయించింది.

సోమవారం నాడు తమ న్యాయవాదుల ఐకాస ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శనలు చేయాలని కూడా నిర్ణయించినట్లు ఐకాస ప్రతినిధులు మీడియాకు వివరించారు.

వెబ్దునియా పై చదవండి