చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిది పొలిటికల్ ఫిక్సింగ్: విజయమ్మ

FILE
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పొలిటికల్ ఫిక్సింగ్ ప్రజలందరికి బాగాతెలుసునని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తెలిపారు.

అప్పట్లో ప్రజారాజ్యం కాంగ్రెస్లో కలిసిన తర్వాతే చంద్రబాబు అవిశ్వాసం పెట్టారని, నేడు కూడా ఎమ్మెల్యేలపై వేటుపడ్డ తర్వాత అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకుంటున్నారని విజయమ్మ అన్నారు.

బాబు, కిరణ్ ఫిక్సింగ్ రాజకీయాలకు ఇంతకన్నా నిదర్శనం ఏముందని ఆమె ప్రశ్నించారు. ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని విజయమ్మ తెలిపారు. 15మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయటం సరికాదన్నారు. ఆ ఎమ్మెల్యేలు ప్రజల పక్షాన నిలిచారని విజయమ్మ అన్నారు.

వెబ్దునియా పై చదవండి