చిరంజీవి వల్లే రాష్ట్రం ముక్కలవుతోంది : దేవినేని ఉమ

ఆదివారం, 4 ఆగస్టు 2013 (12:01 IST)
File
FILE
కేంద్ర పర్యాటక మంత్రి చిరంజీవి అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి, పదవులను పట్టుకుని వేలాడటం వల్లే సమైక్యాంధ్ర ప్రదేశ్ ముక్కలవుతోందని టీడీపీకి చెందిన మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వర రావు ధ్వజమెత్తారు.

రాష్ట్ర విభజనకు చిరంజీవి పూర్తి సహాయ సహకారాలు అందించినట్టు మీడియాలో జోరుగా కథనాలు వస్తున్నాయి. దీంతో ఆయనపై ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయంలో టీడీపీ నేతలు ఒక అడుగు ముందు వరుసలోనే ఉన్నారు. ఇదే అంశంపై ఆయన ఆదివారం మాట్లాడుతూ.. చిరంజీవి అడ్రెస్ ఎక్కడ? అంటూ నిన్న ప్రశ్నించిన ఉమ, నేడు మరికాస్త జోరు పెంచారు.

చిరంజీవి దిగజారుడుతనం వల్లే రాష్ట్ర విభజన చోటు చేసుకుందని దుయ్యబట్టారు. పదవి కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శించారు. సీమాంధ్రలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న నిరసనజ్వాలలు చూసైనా కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలని ఉమ డిమాండ్ చేశారు.

ఇక, అంతా తానైనట్టు వ్యవహరిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పూటకోమాట మాట్లాడుతున్నాడని, విభజనపై మాట్లాడేందుకు ఆయనకున్న అర్హతలేంటని ప్రశ్నించారు.

వెబ్దునియా పై చదవండి