జగన్ సెటిల్‌మెంట్లన్నీ విజయమ్మకు తెలుసు : మధుయాష్కీ

శనివారం, 9 జూన్ 2012 (11:19 IST)
File
FILE
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి సెటిల్‌మెంట్లన్నీ ఆయన తల్లి వైఎస్.విజయలక్ష్మికి బాగా తెలుసని నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ అభిప్రాయపడ్డారు. ఆయన శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ... వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల చిత్తశుద్ధి, ఆ ప్రాంత ప్రజల పట్ల గౌరవమర్యాదలు ఉన్నట్టయితే కేంద్రానికి తెంలగాణ ఇవ్వాలంటూ లేఖ రాయాలని కోరారు.

ఇదే అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. పరకాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కొండా సురేఖను గెలిపించడానికే బీజేపీ తమ అభ్యర్థిని బరిలోకి దింపిందని విమర్శించారు. ఓట్లను చీల్చి సురేఖకు లబ్ది చేకూరేలా పథకం వేశారని ఆయన స్పష్టం చేశారు. అయినప్పటికీ.. ఈ స్థానంలో తెలంగాణ ప్రజలు తెలంగాణ సెంటిమెంట్‌కే పట్టం కడతారని మధుయాష్కీ జోస్యం చెప్పారు.

వెబ్దునియా పై చదవండి