ఢిల్లీ హోటల్‌లో కేసీఆర్‌‌తో బొత్స రహస్య భేటీ : లగడపాటి

బుధవారం, 5 ఫిబ్రవరి 2014 (11:24 IST)
File
FILE
రాష్ట్ర విభజన అంశం పతాక స్థాయికి చేరుకున్న నేపథ్యంలో... వేర్పాటువాది, టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌తో విభజన ముసుగులో ఉన్న సమైక్యవాదిగా ఉన్న పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ రహస్యంగా సమావేశమైనట్టు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆరోపించారు.

ఈ మేరకు ఆయన మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీకి చెందిన కీలక రాష్ట్ర నేత ఒకరు ఢిల్లీలోని ఓ హోటల్‌లో టీఆర్ఎస్ నేత కేసీఆర్‌తో భేటీ అయ్యారని ఆరోపించారు. ఆ కీలక నేత వైసీపీ అధ్యక్షుడు జగన్‌తో కూడా టచ్‌లో ఉన్నారని విమర్శించారు.

ఇలాంటి తెరచాటు రాజకీయాల కారణంగానే రాష్ట్రంలో పార్టీ తీవ్రంగా నష్టపోతోందన్నారు. ఆయన పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణను ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేశారన్న చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగింది. మరోవైపు చానళ్లలో లగడపాటి వ్యాఖ్యలు పదేపదే ప్రసారమవుతుండటంతో బొత్స సత్యనారాయణ స్పందించారు. కేసీఆర్‌తో తన భేటీపై మీడియాలో వస్తున్న వార్తలను, లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యలను ఖండించారు.

వెబ్దునియా పై చదవండి