తెలంగాణ ఇవ్వడం ఖాయం : సోనియా గాంధీ స్పష్టం

శనివారం, 10 ఆగస్టు 2013 (11:10 IST)
File
FILE
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం ఖాయమని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తేల్చి చెప్పారు. తెలంగాణ వస్తుంది. ఆందోళన చెందవద్దు అని ఆమె హామీ ఇచ్చారు. శుక్రవారం క్విట్ ఇండియా ఉద్యమం 71వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో స్వాతంత్య్ర సమరయోధులకు జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

అక్కడ కలిసిన తెలంగాణకు చెందిన ఐదుగురు స్వాతంత్య్ర సమరయోధులతో ఈ సందర్భంగా సోనియా మాట్లాడారు. తెలంగాణ వస్తుంది. నిర్ణయం జరిగింది. అయితే, సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టకండి. వారు బాధపడకుండా చూడండి. వారితో మాటల యుద్ధానికి దిగవద్దు అని ఆమె వారికి సూచించారు. స్వయంగా సోనియా నోటే తెలంగాణ మాట వినడంతో వారంతా హర్షాతిరేకానికి గురయ్యారు.

వెబ్దునియా పై చదవండి