తెలంగాణ వాదం ఉంది కానీ.. ఉద్యమం చల్లారింది : టీజీ

File
FILE
తెలంగాణ ప్రాంత ప్రజల్లో తెలంగాణ వాదం బలంగా ఉందని, కానీ, తెలంగాణ ఉద్యమం మాత్రం ఉందని రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేష్ అభిప్రాయపడ్డారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం సమసి పోయిందేమోగాని ప్రజల మనస్సులో మాత్రం తెలంగాణ వాదం బలంగా ఉందన్నారు.

తెలంగాణ ప్రాంత ప్రజలు తమకు అన్యాయం జరిగిందనే బాధ, ఆవేదనతో వారి మనస్సులో ఉందన్నారు. వారికి న్యాయం చేశామనే నమ్మకం కలిగించే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అయినా ప్రజలు సంతృప్తి చెందకపోతే తర్వాత ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

వెబ్దునియా పై చదవండి