నారా లోకేష్ : ఎన్నికలకు టీడీపీ కార్యకర్తలు సిద్ధం కావాలి!

శుక్రవారం, 8 మార్చి 2013 (15:09 IST)
File
FILE
నారా లోకేష్ పల్లెపల్లెకు తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని.. టీడీపీ శ్రేణులు ఎన్నికలు సిద్ధం కావాలంటూ పిలుపునిచ్చారు. చిత్తరూ జిల్లా గుడిపల్లి మండలం సంగనపల్లిలో శుక్రవారం జరిగిన పల్లెపల్లెకు తెలుగుదేశం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు టీడీపీ కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ సీపీ అసమర్థత, అవినీతికి ప్రతిరూపమంటూ ధ్వజమెత్తారు. అలాగే, టీడీపీ అంటే అభివృద్ధికి ప్రతిరూపమన్నారు.

వచ్చే ఎన్నికల్లో బీసీలకు వంద సీట్లు ఇస్తామని, పది వేల కోట్ల రూపాయలతో బీసీ బడ్జెట్‌ను రూపొందిస్తామంటూ ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉండే ఏకైక పార్టీ ఒక్క టీడీపీ మాత్రమేనని నారా లోకేష్ పిలుపునిచ్చారు.

వెబ్దునియా పై చదవండి