తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ విదేశాల్లో చదవడానికి చెల్లించిన ఫీజు మొత్తం ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకంత్ డిమాండ్ చేశారు.
చంద్రబాబు తన కుటుంబ సభ్యులందరినీ మనీ లాండరింగ్కు వాడారని ఆరోపించారు. తమ ఆరోపణలకు సమాధానం చెప్పే దమ్ము చంద్రబాబుకు ఉందా? అని ప్రశ్నించారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్లో లోకేష్ ఫీజులపై రగడ మొదలైంది.
నారా లోకేష్కు వచ్చిన మార్కులకు రాష్ట్రంలోని ఏ చిన్నా చితకా కాలేజీలోనూ సీటు రాదని, అలాంటిది స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో సీటు ఎలా దక్కిందో చెప్పాలని శ్రీకాంత్ డిమాండ్ చేశారు.
స్టాన్ఫోర్డ్లో సీటు కోసం భారీగా ఫీజు చెల్లించాల్సి వుంటుందని, ఆ డబ్బు ఎక్కడిదో చెప్పాలని శ్రీకాంత్ అడిగారు. దీనిపై విచారణకు చంద్రబాబు సిద్ధమేనా? అని శ్రీకాంత్ సవాలు విసిరారు.