నా జీవితం వ్యర్థమయ్యేదేమో..?: చిరంజీవి

రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టకుంటే తన జీవితం వ్యర్థమయ్యేదేమో..?నని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అన్నారు. రాజకీయాల్లో రావాలని ప్రజలు కోరారని, ఇతరులకు సేవచేస్తూ బతికే నిజమైన జీవితాన్ని ప్రజలు తనకు కల్పించారని చిరు వ్యాఖ్యానించారు. ప్రజా అంకితయాత్రలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన కొల్లపూర్ రోడ్‌షోలో మాట్లాడుతూ.. తన జీవితం ప్రజాసేవకే అంకితం చేస్తానని చెప్పారు.

తనను ప్రజలంతా ఒక రాజకీయ నాయకుడిగా చూడడం లేదని, "మీ చిరంజీవి" అంటున్నారని, అందరిలో ఒకడిగా చూస్తున్నారని మెగాస్టార్ ఎత్తిచూపారు. రాష్ట్ర రాజకీయాల్ని ప్రజా ప్రతినిధులు భ్రష్టు పట్టించారని, ఈ పరిస్థితి మారి కొత్త రాజకీయాలు రావాలని పీఆర్పీ అధినేత అన్నారు. కొత్త రాజకీయాలకు శ్రీకారం చుట్టడం ప్రజల చేతిలోనే ఉందని చిరు వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి